అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో 42 రోజులు సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిఐటియు నాయకులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సమ్మె కాలంలో వేతనాలు, జీవో విడుదల తదితర ఒప్పందాలను ప్రభుత్వ వెంటనే అమలు చేయాలని మంగళవారం పొన్నూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వెంకటరమణకు సిఐటియు నాయకులతోకలిసి అంగన్వాడి నాయకులు వినతిపత్రం అందించారు. ఒప్పందం ప్రకారం సమస్యలు పరిష్కరించాలన్నారు.