ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిన్నదంతా కక్కిస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 12:44 PM

ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పందికొక్కుల్లా మెక్కేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. రెండు మాసాల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తోందని.. వారు తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రెండో రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో జరిగిన భారీ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘ఉత్తరాంధ్ర ఊపే వేరు. ఉత్తరాంధ్ర అంటేనే విప్లవం. ఇప్పుడు ఆ విప్లవం మొదలైంది’ అని తెలిపారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికిన వారి ఆచూకీ ఇప్పటివరకు లేదని.. టీడీపీ వస్తే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశధార, తోటపల్లితో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. ‘తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సిక్కోలులో ఈరోజు అందరూ సింహాల్లా కనిపిస్తున్నారు. అరసవల్లి సూర్యదేవాలయం ఉన్న పుణ్యభూమి ఇది’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com