ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నపిల్లలపై దారుణానికి పాల్పడిన తండ్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 12:43 PM

భార్యభర్తల మధ్య గొడవలు పిల్లల ప్రాణాల మీదకు తెచ్చాయి. భార్యతో విభేదాల కారణంగా కన్నపిల్లలపై దాష్టీకానికి పాల్పడిన తండ్రిపై హత్య కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్ళితే... తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ శాటిలైట్‌ సిటీకి చెందిన గూడి సాయి కిరణ్‌కి ఎర్రవరానికి చెందిన దుర్గతో ఆరేళ్ల కిందట వివాహమైంది. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించుకునే వాడు. కొంతకాలంగా ఇద్దరూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కొడుకు సందీప్‌, ఏడాదిన్నర కూతురితో ఆమె అమ్మగారింటికి వెళ్లిపోయింది. గత నెల 21వ తేదీన అత్తగా రింటికి వెళ్లిన సాయి గొడవపడి ఇద్దరు పిల్లలను తీసు కొని వచ్చేశాడు. ఏమైందో ఏమోగానీ ఆదివారం అతడి ఇంట్లో నుంచి పొగ రావడం గమనించిన స్థానికులు వెళ్లి చూశారు. ఆ ఇంట్లో అప్పటికే అతడు, పిల్లలు తీవ్రంగా కాలిన గాయాలతోపడి ఉండడం చూసి భయాందోళన చెందారు. వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్యాస్‌ లీకై మంటలు అంటుకున్నాయని సాయి చెప్పాడు. వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యానికి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో బంధువుల ఇంటి వద్ద ఉన్న పిల్లల తల్లి అక్కడి నుంచి నేరుగా కాకినాడ ఆస్పత్రికి చేరుకుంది. తనపై కోపంతో పిల్లలపై భర్త సాయి పెట్రోలు పోసి నిప్పంటించాడని సోమవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశామని సీఐ ఉమర్‌ తెలిపారు. పిల్లల ఇద్దరు 80 శాతం మేర కాలిపోవడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని బంధువులు చెప్పారు. చిన్నారులు ఇద్దరూ ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడు తున్నారు. తండ్రి గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com