ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 15న వలంటీర్లకు వందనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 12:42 PM

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయడంలో కీలకంగా పనిచేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా సత్కరిస్తోంది. కనీసం ఏడాది పాటు నిరాటంకంగా పనిచేస్తున్న వలంటీర్లందరినీ సత్కరించి, మూడు కేటగిరిల్లో నగదు బహుమతులను కూడా అందజేయనుంది. ఈ వలంటీర్లకు వందనం నాలుగో విడత  కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తర్వాత రాష్ట్రమంతటా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆ ప్రాంత వలంటీర్లను సత్కరించే కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఒకపక్క ప్రతిపక్షాలు నిత్యం బెదిరింపు ధోరణులతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నా.. కొన్ని పత్రికలు పనిగట్టుకుని నిరంతరం తమపై దుష్ప్ర‌చారం కొనసాగిస్తున్నా.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 2.5 లక్షల మందికిౖ పెగా వలంటీర్లు తమ పనితీరుతోనే రాష్ట్ర ప్రజల మనన్నలతో పాటు దేశ ప్రజల ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com