ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్ బంక్ సిబ్బంది నిద్రమత్తులో ఉంటే.. మెల్లగా దూరి, పైపులేసి.. వారెవ్వా, ఏం తెలివి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 08:02 PM

సాధారణంగా ఎవరైనా పెట్రోల్ బంకులకు పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునేందుకు వెళ్తారు. ఇక దొంగలు అయితే రాత్రిపూట పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి అక్కడున్న సిబ్బంది వద్ద నగదు లాక్కెళ్లిన ఘటనలు, వారితో గొడవ పెట్టుకున్న ఘటనలు కూడా అక్కడక్కడా జరుగుతూ ఉంటాయి. కానీ అనంతపురం పోలీసులకు చిక్కిన ముఠా స్టైలే వేరు. పెట్రోల్ బంకుల నుంచి ఏకంగా క్యాన్లు, డ్రమ్ముల కొద్దీ డీజిల్, దొంగతనం చేస్తుంది ఈ ముఠా. జాతీయ రహదారులపై ఉన్న పెట్రోల్ బంకులే వీరి టార్గెట్. రాత్రిపూట పెట్రోల్ బంక్ సమీపంలో లారీలను ఆపుతారు. పెట్రోల్ బంక్ వద్ద రెక్కీ నిర్వహిస్తారు.


ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ బంక్ సిబ్బంది నిద్రపోతున్న టైమ్ చూసుకుని.. బంకులోకి ప్రవేశిస్తారు.పెట్రోల్ గన్‌తో కాకుండా.. భూమిలో ఉన్న ట్యాంక్‌లోకి పైపులు వేసి డీజిల్, పెట్రోల్‌ను లారీలోని డ్రమ్ములు, క్యాన్లలో నింపేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి చక్కాపోతారు. ఇలా పెట్రోల్, డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఎనిమిది సభ్యుల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంతర్రాష్ట్ర ముఠా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరి నుంచి రెండు లారీలు, రూ. 3.50 లక్షల నగదు, 50 డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.


మరోవైపు ఈ ముఠాపై ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇలా చోరీ చేసిన పెట్రోల్‌ను మహారాష్ట్రలో తక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులే వీరి టార్గెట్ అని అనంతపురం పోలీసులు చెప్పారు. పెట్రోల్ బంకుల వద్ద భూమిలోపల ఉన్న ట్యాంక్‌లో నుంచి పెట్రోల్, డీజిల్ తోడేందుకు వీరి వద్ద ప్రత్యేకమైన పైప్స్, మెషీన్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com