ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ అభ్యర్థికి వైసీపీ ఎమ్మెల్సీ నుంచి ఊహించని ప్రపోజల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 07:45 PM

సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అబ్బో అదో పెద్ద హడావిడి. పార్టీ నుంచి సీటు దక్కించుకునే దగ్గర నుంచి.. ఆ తర్వాత బీ ఫారాలు, నామినేషన్లు, ఎన్నికల ప్రచారాలు, అసంతృప్తుల బుజ్జగింపులు, ఎన్నికల రోజు పోల్ మేనేజ్‌మెంట్.. ఇలా యవ్వారం మామూలుగా ఉండదు. ఇక నామినేషన్ వేసింది మొదలుకుని ప్రచారం ముగిసేవరకూ అభ్యర్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పార్టీలోని లోకల్ క్యాడర్‌ను మచ్చిక చేసుకోవాలి, పదుల సంఖ్యలో వాహనాలతో ప్రచారం చేయాలి, ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించాలి, ఓట్ల కోసం అనేక ఫీట్లు చేయాలి.. ఇలాంటివెన్నో ఉంటాయి. అయితే ఓవైసీపీ లీడర్.. టీడీపీ అభ్యర్థికి ఛాలెంజ్ చేశారు. అయితే ఇది విన్న తర్వాత ఛాలెంజ్ అనడం కంటే ప్రపోజల్ అనడమే కరెక్ట్‌గా ఉంటుందేమో.


తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం. ఈ మధ్య కాలంలో వార్తల్లో బాగా నానిన నియోజకవర్గమిది. టీడీపీ అధినేత చంద్రబాబు.. మండపేట స్థానానికి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావును ప్రకటించడమే ఇందుకు కారణం. అయితే జనసేనతో పొత్తులో ఉండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సమాచారం ఇవ్వకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ చంద్రబాబు వైఖరిపై అప్పట్లో జనసేన నేతలు మండిపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం పోటీగా రెండు అసెంబ్లీ స్థానాలలో జనసేన పోటీ చేస్తుందంటూ ప్రకటించారు. అలా మండపేట నియోజకవర్గం పేరు


అయితే మండపేట టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావును చంద్రబాబు ఖరారు చేయడంతో ఆయన ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జోగేశ్వరరావు ఎదుట ఛాలెంజ్ కమ్ ప్రపోజల్ ఉంచారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. నియోజకవర్గంలోని కేశవరం గ్రామాన్ని ఓ యూనిట్ లెక్కన తీసుకుని ప్రైవేట్ ఎన్నిక పెడతామని.. అందులో ఎవరు గెలిస్తే వాళ్లనే ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. ఓడిపోయిన అభ్యర్థి ఎన్నికల నుంచి తప్పుకోవాలని.. అభివృద్ధి జరగలేదంటున్న జోగేశ్వరరావు ఇందుకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. అయితే టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు నుంచి ఈ సవాల్‌కు ఇంకా రియాక్షన్ రాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com