ఏపీలో జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ, పొత్తుకు సంబంధించి అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. పలు అంశాలను ఓ కొలిక్కి తీసుకురావాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన కొద్దిసేపటి కింద విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా పవన్ మంగళగిరి వెళ్లారు. పవన్... టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.