ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారత జట్టు ప్రకటన.. ఆ ప్లేయర్ పై అందరి చూపు

sports |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2024, 12:03 PM

వైజాగ్‌ టెస్టులో భారత్ విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో మిగిలిన 3 టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో జట్టు ఎంపికతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ జట్టు ఎంపికలో కోహ్లి ఉంటాడా లేదా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. అందులో 6 మ్యాచ్ ల్లో గెలిచి, 3 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. మరొకటి డ్రాగా ముగిసింది. విన్నింగ్ పర్సంటేజ్ ని లెక్కేస్తే 66 పాయింట్లతో, 55 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.  రెండో స్థానంలో ఉన్న టీమిండియా 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 2 ఓడిపోయింది. ఒకటి డ్రాగా ముగిసింది. ఇలా మొత్తం 38 పాయింట్లు, 52.77 విజయం శాతంతో రెండో స్థానంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com