ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్‌-2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 03:42 PM

ఏపీలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు పొడిగించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అభ్యర్థులు జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com