సముద్రాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు దొరికే అరుదైన చేపలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. వీటికి లక్షల్లో ధర పలుకుతుంది. తాజాగా గోల్డెన్ ఫిష్ గా పిలిచే అరుదైన కచిడి చేప అనకాపల్లి జిల్లా మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది.
27 కిలోల ఈ చేపను పూడిమడకకు చెందిన వ్యాపారి మేరుగు కొండయ్య రూ.3.90 లక్షలకు దక్కించుకున్నారు. కచిడి చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు.