ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనేకమందిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే అయన చేసిన తప్పా ..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 02:35 PM

కాకినాడ పరిధిలోని జగ్గంపేటలో చంద్రబాబుకి మద్దతుగా నిర్వహిస్తున్న  దీక్షా శిబిరంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. హెరిటేజ్‌లో 2 శాతం అమ్మినా రూ.400 కోట్లు వస్తాయి. ప్రజల సొమ్ము మాకొద్దు. మానవుడే దేవుడు అని మా నాన్న నమ్మారు. ఆ నీడలో మేము పెరిగాం. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నాం.’’ అని చెప్పుకొచ్చారు. మా పోరాటం ప్రజల కోసం. మా కుటుంబం ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా ట్రస్ట్ ద్వారా వేలాది మందిని చదివిస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడూ ఏపీని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు. ప్రజల మనిషిని జైల్లో పెట్టారు. చంద్రబాబు చేసిన తప్పు ఏంటి?.’’ అని నిలదీశారు. ‘‘స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ది చెంది అనేక మంది సీఈవో స్థాయికి వెళ్ళారు. చంద్రబాబు చేసింది తప్పా? ఆలోచించాలి. ఐటీ, ఇతర రంగాలు హైదారాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. వారిని ఆపేశారు. ప్రజలు టెర్రరిస్టులా?, హైదరాబాద్ నుంచి రావడానికి పాస్ పోర్ట్‌లు కావాలా? అని భువనేశ్వరి ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com