ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయసాయిరెడ్డి కి కౌంటర్ ఇచ్చిన అయ్యన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 05:09 PM

టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  చేసిన ట్వీట్‌కు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ట్వీట్ చేశారు. సాయి రెడ్డి ది ఉనికి సమస్య అని.. టీడీపీ మానిఫెస్టోతో వైసీపీ మాయం అవ్వడం ఖాయం అంటూ వైసీపీ ఎంపీకి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్‌లో ఏమన్నారంటే... ఎంపీ సాయిరెడ్డికి పార్టీలో ఉనికి సమస్య మొదలైనట్లు ఉందని అన్నారు. చాలా రోజుల తరువాత పార్టీ ఆఫీస్‌కు వచ్చిన సాయిరెడ్డి టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు చేసి జగన్ దృష్టిలో పడేందుకు నానా పాట్లు పడుతున్నారని యెద్దేవా చేశారు. మహానాడులో తెలుగుదేశం ఇచ్చిన మొదటి ఫేజ్ మేనిఫెస్టో వైసీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తుందని.. రోజూ వాళ్ల ఉలిక్కిపాటు చూస్తేనే అర్థం అవుతుందన్నారు. రూ. 2 కిలో బియ్యం వంటి కొత్త పథకాలు... మహిళలకు ఆస్తిహక్కు వంటి నిర్ణయాలు.. ప్రజల వద్దకు పాలన వంటి సంస్కరణలు.. జన్మభూమి వంటి కార్యక్రమాలు. విజన్- 2020తో ప్రజల బతుకులు మార్చిన ఆలోచనలు చేసిన తెలుగుదేశం పార్టీ.. ఎవరినీ కాపీ కొట్టాల్సిన అవసరం లేదని మీరు, మీ పేటీఎం గాళ్లు తెలుసుకోవాలని ఆయన హితవుపలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com