ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బులెట్ బైక్ నడుపుతుండగా అదుపుతప్పింది.,,కారుమూరు నాగేశ్వరరావుకి తప్పిన ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 10:21 PM

పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను అవమానిస్తూ.. చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని.. అందుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరు నాగేశ్వర రావు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా.. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు.. తన కుమారుడిని ఎక్కించుకొని బుల్లెట్ బైక్ నడిపారు. ఈ క్రమంలో మంత్రి నడిపే బైక్ అదుపు తప్పింది. మంత్రి కారుమూరు నాగేశ్వర రావు కింద పడబోయారు. వెంటనే స్పందించిన కార్యకర్తలు మంత్రిని పైకి లేపారు.


ఈ ఘటనలో మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో మళ్లీ బైక్ ర్యాలీని కంటిన్యూ చేశారు. దాదాపు 2 వేల బైక్‌లతో తణుకు నుంచి అత్తిలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వర రావు చంద్రబాబు, టీడీపీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు పేదలంటే గౌరవం లేదని.. అందుకే వారికి ఇచ్చే ఇళ్ల స్థలాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com