ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిపోయిన వధువుతోనే పెళ్లి.... పీటమీదే 13 రోజులు కూర్చోని వరుడి విజయం

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 10:17 PM

విచిత్ర పెళ్లిళ్లు చూడాలంటే సినిమాలను చూడాలి. కానీ ఇఫుడు పరిస్థితి మారిపోయింది. నిజజీవితంలోనే ఆ సన్నివేశాలు మనకు దర్శనమిస్తున్నాయి. వివాహం కోసం ఆ వరుడు పెళ్లి పీటల మీద వేచిచూస్తున్నాడు. అంతా సిద్ధమైంది. ఇక వధువును తీసుకురమ్మని.. పురోహితుడు పిలవగా.. యువతి బంధువులు కొంచెం సేపు ఆగాలని సూచించారు. ఎంత సమయం అయినా పెళ్లి కూతురు.. పీటల మీదికి రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా.. ఆమె పారిపోయింది. కడుపు నొప్పి వస్తుందని చెప్పి బాత్‌రూమ్‌కు వెళ్లాలని చెప్పిన వధువు.. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి మామ కుమారుడితో అక్కడి నుంచి పారిపోయింది. ఈ అనుకోని సంఘటనతో పెళ్లి కుమారుడు.. అతని బంధువులు సహా అక్కడికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. పెళ్లి కూతురు మీద ఎంతో ఇష్టం పెంచుకున్న ఆ వరుడు.. 13 రోజుల పాటు అదే పెళ్లి డ్రెస్‌లో వేచిచూశాడు. చివరికి ఆ యువతిని తీసుకువచ్చి పెళ్లి చేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.


రాజస్థాన్‌ పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్‌ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్‌ కుమార్‌తో వివాహం కుదుర్చారు. మే 4 న పెళ్లి ఉండగా.. వరుడు, అతని బంధువులు.. మే 3న పెళ్లికుమార్తె గ్రామానికి చేరుకున్నారు. వారికి పెళ్లి కుమార్తె బంధువులు ఘన స్వాగతం పలికారు. ఇక తెల్లవారుజామున పెళ్లి పందిట్లోకి వరుడు వచ్చి కూర్చుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత.. పెళ్లి కుమార్తెను కూడా మండపంలోకి తీసుకురావాలని పురోహితుడు సూచించాడు. అయితే కొద్దిసేపు వేచి ఉండాలని పెళ్లి కుమార్తె తరపు బంధువులు చెప్పారు. పెళ్లికుమార్తె ఎంతకూ మండపంలోకి రాకపోవడంతో.. అందరూ ఇంట్లోకి వెళ్లి చూడగా.. అసలు విషయం బయటపడింది. తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తుందని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లిన మనీషా.. అక్కడే ఉన్న తన మామ కుమారుడితో పారిపోయింది. ఈ విషయం తెలుసుకుని పెళ్లి కుమారుడితోపాటు అక్కడికి వచ్చిన బంధువులంతా నోరెళ్లబెట్టారు.


అయితే పెళ్లి నుంచి అకస్మాత్తుగా పారిపోయిన మనీషాకు తల్లిదండ్రులు, బంధువులు ఎంతో నచ్చజెప్పారు. ఇంటికి తీసుకువచ్చి ఎంత బతిమిలాడినా వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇంట్లోనే 13 రోజుల పాటు మొండికేసి కూర్చుంది. అయితే మనీషాపై చాలా ఆప్రేమ పెంచుకున్న వరుడు.. పెళ్లి అలంకరణలో అలాగే వేచి చూశాడు. పెళ్లి సందర్భంగా ధరించిన పగిడీ కూడా తీయకుండా మనీషా వస్తుందన్న ఆశతో ఎదురు చూశాడు. వారిద్దరి వివాహం కోసం వేసిన పెళ్లి మండపాన్ని కూడా తొలగించకుండే అదే అలంకరణతోనే ఉంచారు. అయితే ఎట్టకేలకు బంధువులంతా మనీషాను ఒప్పించారు. దీంతో మే 16న.. ఆమెను ముస్తాబు చేసిన పెళ్లి పీటలపైకి తీసుకువచ్చారు. తర్వాత వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో సినిమా రేంజ్‌లో సాగిన ఈ పెళ్లి తంతు చివరికి.. ఇద్దరూ ఒక్కటవ్వడంతో శుభం కార్డు పడింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com