ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికార పార్టీ నేతల మధ్య పరస్పర గొడవలు, కేసులు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 12:56 PM

అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతలకు  ఉపాధి పనుల విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం దంతలపల్లిలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు, బోగాతి నారాయణరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.  ఈ ఘర్షణలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు బాల వెంకటరెడ్డి, బోగాతి నారాయణరెడ్డి వర్గీయుడు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణపై ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యల్లనూరు మండలంలో కొంతమంది నాయకుల స్వార్థ ప్రయోజనాలు కోసం గ్రామాల్లో కక్ష్యలు రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆటవిక రాజ్యం నడుస్తుందని... పుట్లూరు,యల్లనూరు మండలాలతో సంబంధాలు ఉన్నప్పటికీ జోక్యం చేసుకోవడం లేదని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com