టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 82 రోజులుగా విజయవంతంగా కొనసాగుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజవర్గాల్లో పాదయాత్ర చేసిన లోకేష్ ఆయా సామాజిక వర్గాలు, రైతులు, ప్రజలు, యువత చెప్పిన సమస్యలను సామరస్యంగా వింటూ టీడీపీ ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.