ప్రముఖ సినీనటుడు, టీడీపీ పార్టీ స్థాపకుడు ఐనటువంటి నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు సభలో పాల్గొనేందుకు తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో రజినీకాంత్కు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. ఎలా ఉన్నారంటూ రజనీకాంత్, బాలయ్య పరస్పరం పలకరించుకున్నారు. ఆపై ఒకే కారులో ఇరువురు నోవోటెల్కు బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్కు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఉండగలనా అంటూ సూపర్స్టార్ వ్యాఖ్యానించారు. నోవోటెల్ హోటల్కు వెళ్లిన వెంటనే రజినీకాంత్తో బాలయ్య కాసేపు సమావేశమయ్యారు.