ఇండియాలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు మరింత విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కరోనా వైరస్తో ఏకంగా 44 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,31,468కి చేరింది. కొత్తగా 7,533 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 53,852 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రికవరీ రేటు 98.69 శాతం ఉండగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.