ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నైపై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 11:27 PM

ఈరోజు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. అయితే 203 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో శివమ్ దూబే 52 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 47 పరుగులు, మొయిన్ అలీ  23 పరుగులు, జడేజా 23 పరుగులు, రాజస్థాన్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసాడు,కుల్దీప్ యాదవ్ కి ఒక వికెట్ తీసాడు.


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com