డుంబ్రిగుడ మండలంలోని జైపూర్ జంక్షన్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖకు చెందిన ముగ్గురు యువకులు బైక్ పై చాపరాయి జలపాతాన్ని చూసి తిరిగి వస్తున్న సమయంలో అరకులోయ వైపు నుంచి పాడేరు వైపు వెళ్తున్న పర్యాటక వాహనం జైపూర్ జంక్షన్ సమీపంలోని రాంగ్ రోడ్డుపై వెళ్లి బైక్ పై వస్తున్న ముగ్గురు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో స్థానికులు ఘటన చోటికి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగక్కపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.