ప్రతిపక్షాలు ఎంత బురద జల్లితే కమలం అంత బాగా వికసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. విమర్శలపై రాజ్యసభలో ఆయన ఎదురు దాడికి దిగారు. ‘గరీబీ హటావో అని నినాదం చేసే కాంగ్రెస్ 40 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నా ఏమీ చేయలేదు. మేము ప్రజల ఆశయాలను, అంచనాలను అందుకునేలా కష్టపడుతున్నాం. ప్రభుత్వ పథకాలను పార్టీలకు అతీతంగా అందరి లబ్ధిదారులకు అందజేయడమే నిజమైన సెక్యులరిజం’ అని తెలిపారు.