జర్మనీ దేశంలోని ఫ్రాంక్ ఫర్డ్ నగరంలో ఫిబ్రవరి 7 వరకు నిర్వహించిన అంబియాట్-2023 అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ లో ఏపీ నుండి పట్టు వస్త్రాలు, ఇంటీరియల్ డిజైన్లు ప్రదర్శించినట్లు ప్రొద్దుటూరు మాస్టర్స్ వీవర్ కడప రామిశెట్టి బుధవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలోని చేనేత అభివృద్ధి సొసైటీ కమీషనర్ తమ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ పరిసర ప్రాంతాల్లో తయారైన పట్టు ఆధారిత వస్త్రాలు, డిజైన్ల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ను కేటాయించినట్లు ఆయన తెలిపారు.