సింహాద్రిపురం మండల కేంద్రంలోని బుడ్డయ్యస్వామి ఆలయ సమీపంలోని గృహ సముదాయాల మధ్యన ముళ్లపొదలకు బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమీపంలో నివాసం ఉన్నవారు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.