ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్చూరు గ్రామ సందర్శన చేపట్టిన ఆమంచి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 04:05 PM

అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులోని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నడుం బిగించిన వైసిపి సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ గురువారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా పర్చూరు బొమ్మల సెంటర్ ఆవరణ లోనున్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి, వంగవీటి రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అద్దంకి నాచారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక ఆమంచి కాలినడకన గ్రామ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మండల పార్టీ కన్వీనర్ కటారి అప్పారావు, ఎంపీపీ మేక ఆనందకుమారి, సర్పంచ్ మల్ల అంజమ్మ, వైస్ ఎంపీపీ కోట ప్రసన్న, మాజీ ఎంపీపీ కోట హరిబాబు తదితరులు ఆమంచి వెంట ఉన్నారు. తొలుత పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఆమంచి కృష్ణమోహన్ కు ఘన స్వాగతం పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com