మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా సమన్వయంతో పనిచేయాలని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా అన్నారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో జరిగిన గృహసారధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు మా నమ్మకం నువ్వే జగనన్న అనే స్టిక్కర్లను గృహ యజమానుల అనుమతితో ప్రతి గృహానికి అంటించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాధ్, తూర్పు నియోజకవర్గ పరిశీలకుడు అడపా శేషుబాబు, వైసిపి మహిళా నాయకురాలు నూరి ఫాతిమా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.