ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అంతర్భాగంగా ఉన్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గురువారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో చీరాలలో సందడి నెలకొంది. మార్చి 13న జరిగే ఈ ఎన్నికల్లో దళిత సమాఖ్య అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న చీరాల పట్టణానికి చెందిన విద్యావేత్త నీలం శామ్యూల్ మోజస్ ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్నారు ఇప్పటికే నెల్లూరు నుండి ఆయన ప్రచార భేరి మోగించడం తెలిసిందే. రాష్ట్రస్థాయి దళిత నాయకులు శామ్యూల్ మోజస్ తరఫున ప్రచారానికి రా తరలి రానున్నారు.