ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గురువారం చీరాల పట్టణంలో మెరుపులా మెరిసి మాయమయ్యారు. ప్రైవేట్ కార్యక్రమాల నిమిత్తం పట్టణానికి వచ్చిన మంత్రి ఆ పనులు ముగించుకొని నిష్క్రమించారు. రాకరాక చీరాల వచ్చినా కనీసం రవాణా శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని సమాచారం. మరోవైపు మంత్రి రాక గురించి సమాచారం లేదేమో పార్టీ ముఖ్య నేతలు కూడా ఆయన వచ్చి వెళ్లిపోయారన్న విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి హాస్పిటల్ లో ఆయన కాసేపు సేదదీరారు.