ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజా మార్పింగ్ ఫోటో వైరల్... ‘వైఎస్ఆర్ పోలవరం’ అంటూ ట్రోలింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 12:55 AM

పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో అధికార పార్టీ నేతలను నెటిజన్లు సందర్భం దొరికినప్పుడల్లా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా పర్యాటక మంత్రి రోజాను నెటిజన్లు ట్రోల్ చేశారు. ‘వైఎస్ఆర్ పోలవరం’ను రోజా ప్రారంభించారంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలోని నిండ్ర మండలంలోని బీజీ కండ్రిక, ఎంసీ కండ్రిక గ్రామాల్లో.. రూ.11 లక్షలతో నిర్మించిన తాగునీటి బోరు, పైపులైన్లను మంత్రి రోజా ఇటీవల ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రోజా ప్రారంభించిన వాటర్ ట్యాక్ మీద ‘స్టార్ ప్రో’ అని రాసి ఉండగా.. దాన్ని ఎడిటింగ్ చేసిన కొందరు.. ఇంగ్లిష్‌లో ‘వైఎస్ఆర్ పోలవరం’ అని రాశారు. పోలవరం ప్రాజెక్టును రోజా ప్రారంభించారంటూ.. మార్ఫింగ్ చేసిన ఫొటోను వైరల్ చేస్తున్నారు. అన్నతో కలిసి పోలవరాన్ని ప్రారంభించిన మంత్రి రోజా అంటూ సెటైర్లు వేస్తున్నారు. కొందరేమో ఆ మాత్రం చిన్న ట్యాంక్‌కు రూ.11 లక్షలు ఖర్చయ్యిందా అని ప్రశ్నిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com