ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ పతాకం నుంచి ఆ రంగు తీసేయగలదా...అసదుద్దీన్ ఓవైసీ

national |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 07:08 PM

త్రివర్ణ పతాకం నుంచి మోదీ సర్కారు ఆకుపచ్చని రంగును తొలగిస్తుందా అని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నేడు లోక్ సభలో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఆకుపచ్చని రంగుతో ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఎందుకని? ప్రధాని మోదీ చైనా దురాక్రమణలపై మాట్లాడతారా? బిల్కిస్ బానోకి న్యాయం దక్కుతుందా? అని ప్రశ్నించారు. ముస్లింలు ఆకుపచ్చని రంగును పవిత్రంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. 


మైనారిటీ పథకాలకు నిధుల కేటాయింపులను తగ్గించడాన్ని విమర్శించారు. ‘‘పస్మంద ముస్లింల పట్ల అంత ప్రేమ ఉంటే వారికి దళిత ముస్లింల హోదా ఇవ్వాలి’’ అని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అలాగే, బీహార్ ముస్లింలకు ఓబీసీ హోదా కావాలన్నారు. హిండెన్ బర్గ్ భారత్ లో ఉండి ఉంటే చట్టవిరుద్ధ చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చేదని సెటైర్ వేశారు. ప్రధాని చైనా పట్ల భయం చెందకుండా, మైనారిటీలకు నిధులు పెంచాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి భారీ కేటాయింపుల నేపథ్యంలో ఒవైసీ ఇలా వ్యాఖ్యానించారు. అదానీ గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ నివేదిక విడుదల చేయడం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com