ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది రికార్డింగ్ అని చెప్పిన కోటంరెడ్డి స్నేహితుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 06:27 PM

అది ఫోన్ ట్యాపింగ్ కాదు అది రికార్డింగ్ కాల్ అని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి భారీ ట్విస్ట్ ఇచ్చారు. కోటంరెడ్డి స్నేహితుడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. కోటంరెడ్డి తనతో కాంట్రాక్టుల విషయంతో పాటు.. రాజకీయాల గురించి మాట్లాడారని చెప్పుకొచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడిన మాటలే.. మరోసారి తనతో చెప్పారని రామశివారెడ్డి వివరించారు. తన ఫోన్‌లో ప్రతీ కాల్ ఆలోమేటిక్‌గా రికార్డు అవుతుందని.. తాను మరో కాంట్రాక్టర్‌కు షేర్ చేయటంతో.. అది వైరల్ అయిందని రామశివారెడ్డి స్పష్టం చేశారు.


అక్కడితో ఆగకుండా.. తన ఫోన్‌లో నాలుగు నెలల నుంచి రికార్డు అయిన కాల్ డేటాను రామశివారెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. ఏ విచారణ సంస్థ అడిగినా.. తాను ఆ వివరాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. కోటంరెడ్డి ఎందుకు ట్యాపింగ్ జరిగినట్లుగా చెబుతున్నారో తనకు తెలియదని చెప్పారు. కేంద్ర విచారణ సంస్థలు, ఫోరెన్సిక్‌కు తన ఫోన్ ఇవ్వమని చెప్పినా.. ఇవ్వడానికి తాను సిద్దమేనని రామశివా రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు బూమరాంగ్ అయ్యాయని తెలుస్తోంది.


తాను ఉద్దేశ పూర్వకంగా కాల్ రికార్డింగ్‌ను కాంట్రాక్టర్‌కు పంపలేదని.. అది తరువాత వైరల్ అవుతుందని ఊహించలేదని రామశివారెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఎవరి ప్రోద్బలంతో.. ఎవరి ఒత్తిడితో ఈ విషయాలు చెప్పటం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను వైఎస్సార్ భక్తుడినని.. ప్రభుత్వానికి సంబంధం లేని ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. తనను ఎవరూ కలవలేదని.. జరుగుతున్న వివాదం చూసి తానే ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నానని వివరించారు.


ఇటు.. మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. తన మీద కోపంతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ ప్రజల గొంతుకుగా మారుతానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com