చిలకలూరిపేట పట్టణంలోని, 12వ వార్డులోని, తూర్పుమాలపల్లిలో గల లూధరన్ చర్చిలో, చిలకలూరిపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో, పాస్టర్ పుల్లగూర అనిల్ కుమార్ బుధవారం తారకరత్న త్వరగా కోలుకోవాలని. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నందమూరి తారకరత్న రాక కోసం అభిమానులు, రాష్ట్రంలోని కార్యకర్తలందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని, ఈ సందర్భంగా లూధరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని, ఎస్సీ సెల్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు తదితరలు పాల్గొన్నారు.