ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర పడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 03:24 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని మంత్రి వర్గ సహచరులే ముంచుతారని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...  సీఎం జగన్‌ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర పడిందన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న జిల్లా పర్యటనల్లో ప్రజలు తండోపతండాలుగా హాజరు కావడం చూసి.. రానున్న ఎన్నికలే వైసీపీకి చివరివని స్పష్టమైపోతోందని అన్నారు. నందమూరి తారకరత్నకు గుండెపోటు వస్తే.. దానిని కూడా కొంత మంది వైసీపీ మంత్రులు అపహాస్యం చేశారని, దీని వల్ల ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నంద్యాల నాగేంద్ర కుమార్‌, సత్రం రామకృష్ణుడు, ఆకేపోగు ప్రభాకర్‌, పేరపోగు రాజు, మంచాలకట్ట భాస్కర్‌ రెడ్డి, నాగరాజు యాదవ్‌, షేక్షావలి, రవిశంకర్‌, బుర్రా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com