ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:54 PM

పార్లమెంటు ఉభయసభల్లో ఆర్థిక సర్వే నివేదికను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇదిాలావుంటే పార్లమెంటులో ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశ పెట్టడం ఆనవాయతీగా వస్తోంది. చీఫ్ ఫైనాన్స్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. 


ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు:


* 2023-24 సంవత్సరానికి గాను వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చు. 


* పీపీపీ పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఎక్స్ ఛేంజ్ రేటు పరంగా 


ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా. 


* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంది. 


* వాస్తవ జీడీపీ 6 నుంచి 6.8 మధ్యలో ఉండొచ్చు. 


* ఆర్థిక వ్యవస్థ కోవిడ్ ముందు స్థాయికి చేరుకుంది. 


* ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఓడీబీ, ఆర్బీఐ అంచనాలకు తగ్గట్టుగానే భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు ఉన్నాయి.   


* కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగితే ఇండియన్ కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనవుతుంది. 


* కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కు ఫైనాన్స్ చేయడానికి తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com