ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కు వీడ్కోలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 01:09 PM

రెండు రోజుల విశాఖ పర్యటనకు వచ్చిన హర్యానా గవర్నర్ మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఎంపీ జివిఎల్ నరసింహారావు, జిల్లా పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి , కరణంరెడ్డి నర్సింగరావు కలిసి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. రెండు రోజుల ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకుగాను విశాఖపట్నం విచ్చేసిన బండారు దత్తాత్రేయ నగరంలోని పార్టీ పాత, ప్రస్తుత సహచరులను కలుసుకొని ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి సుజాత , సుబ్రహ్మణ్యం, నాగేశ్వరావు రామ్ కుమార్ , మురళీకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com