ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖకు రానున్న రాష్ట్ర గవర్నర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:55 AM

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మంగళవారం విశాఖపట్నం నగరానికి రానున్నారు. ఉదయం 9.40 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉప కులపతుల సదస్సులో పాల్గొంటారు. అనంతరం పోర్టు అతిథి గృహానికి చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి చినముషివాడలో గల శారదా పీఠానికి వెళతారు. పీఠం నుంచి 3.15 గంటలకు బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com