ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ గొప్ప వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీయడమా...మమతా బెనర్జీ

national |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:47 AM

నోబెల్ విజేత, ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ పట్ల కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటుండడం పట్ల ఆమె స్పందించారు. అమర్త్యసేన్ కు ఆమె మద్దతుగా నిలిచారు. అమర్త్యసేన్ తమ భూమిని ఆక్రమించారంటూ విశ్వభారతి యూనివర్సిటీ ఆరోపిస్తోంది. ఆ భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ వర్సిటీ యాజమాన్యం అమర్త్యసేన్ కు లేఖ రాసింది. 


ఈ నేపథ్యంలో, బిర్భూమ్ లోని పూర్వీకుల ఇంట్లో ఉన్న అమర్త్యసేన్ ను మమతా బెనర్జీ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమర్త్యసేన్ వంటి వ్యక్తిని బీజేపీ ఈ విధంగా అవమానించడం సరికాదని హితవు పలికారు.  "అమర్త్యసేన్ ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారా? కాషాయీకరణ పోకడలకు పోకుండా, విశ్వభారతి యాజమాన్యం సరైన పంథాలో నడవాలని కోరుకుంటున్నాను" అని మమతా బెనర్జీ తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com