అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తొలుత ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 59,304 వద్ద, నిఫ్టీ 17,595 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.64 వద్ద ప్రారంభమైంది. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నేడు సూచీలు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది.