నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ మహోత్సవం పోలూరు నుండి నూతనంగా ఎన్నికైన నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేరెడ్డి మహేశ్వరరెడ్డి వందలాది మందితో కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యేను కలిసి సాదర స్వాగతం పలికారు. నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేరెడ్డి మహేశ్వరరెడ్డి, వైస్ చైర్మన్ గా చిమ్మా నాగన్న, డైరెక్టర్లుగా బొల్లిమునయ్య, కొత్త కృష్ణమూర్తి, చిలమకూరు వెంకటేశ్వరరెడ్డి, బచ్చు శ్రీనివాస చక్రవర్తి, జల్లిపల్లి దిలీప్కుమార్, కత్తి శంకర్, జాగలి లింగమ్మ, చిక్కెం లక్ష్మీప్రసన్న, రాజేశ్వరమ్మ, మమత, షేక్ సర్దజ్, షేక్ కౌసర్, బిలావత్ హైమావతిలు ప్రమాణ స్వీకారం చేశారు.