ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ యూటర్న్ వారికి శాపంగా మారింది....పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం

international |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:47 PM

పాకిస్థాన్ లో ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ దేశంలో ఘోర పడవ ప్రమాదం చోటుచోసుకుంది. ఖైబర్ పక్తున్‌ఖ్వాలోని టాండా దామ్ సరస్సులో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మంది ప్రాణాలు కోల్పోయారు. సరస్సులో విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి పడవలో 30 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మిగతావారిని రక్షించినట్టు చెప్పారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన విద్యార్థులంతా ఓ మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నారని, వీరంతా 12 నుంచి 20 ఏళ్లలోపు వారేనని పేర్కొన్నారు.


ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 40 మందికిపైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొహాట్‌ జిల్లాలోని టండా డ్యాంలో పడవ ప్రమాదం చోటుచేసుకుని ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మృతిచెందారని, మరో 13మందికి గాయాలు అయ్యాయి. ‘‘పడవలో 30 మంది ప్రయాణిస్తున్నారు. 10 మంది మృతదేహాలను బయటకుతీశాం.. 17 మందిని రక్షించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం.. విద్యార్థులందరూ 12 నుంచి 20 ఏళ్లలోపు వయసువారే’’ అని డిప్యూటీ కమిషనర్‌ ఫుర్కాన్‌ అష్రఫ్‌ తెలిపారు.


ఈ ఘటనపై ఖైబర్ పక్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి అజమ్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి, వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టి.. చిన్నారుల ప్రాణాలను కాపాడాలని అధికారులను ఆదేశించారు. పాక్‌లో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గతేడాది జులైలో సింధు నదిలో పడవ బోల్తాపడి 19 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు.


మరోవైపు, బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని లస్బెలా ప్రాంతంలో 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో వంతెన స్తంభాన్ని ఢీ కొట్టింది. అనంతరం లోయలో పడ్డ బస్సుకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 42 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మిగతావారి పరిస్థితి విషమంగా ఉంది. ఓ చిన్నారి, మహిళతో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిని గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com