రెండో టీ20లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్, టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈమ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ న్యూజిలాండ్ ఎంచుకుంది.అయితే తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేసింది.టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్యా 1, వాషింగ్టన్ సుందర్ 1, చాహల్ 1, కుల్దీప్ యాదవ్ 1, దీపక్ హుడా 1 వికెట్ తీశారు.