దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. పోచెఫ్స్ట్రూమ్లో జరిగిన టైటిల్ పోరులో భారత అమ్మాయిలు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ను సద్వినియోగం చేసుకుని ఇంగ్లండ్ను 68 పరుగులకు కుదించారు.భారత బౌలర్లలో టిటాస్ సాధు 2, అర్చన దేవి 2, పార్షవి చోప్రా 2, మన్నత్ కశ్యప్ 1, కెప్టెన్ షెఫాలీ వర్మ 1, సోనమ్ యాదవ్ 1 వికెట్ తీశారు.