సీఎం జగన్పై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర లో భాగంగా పాడి రైతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... టీడీపీ హయాంలో పాడి రైతులకు అండగా నిలిచామన్నారు. పాడి రైతులకు సబ్సిడీలో దాణా, సైలేజ్ తక్కువ రేటుకే అందించామని తెలిపారు. వైసీపీ పాలనలో సబ్సిడీలు లేవని, దాణా, సైలేజ్ ఇవ్వడం లేదని తప్పుబట్టారు. లీటర్ పాలకు రూ.4 బోనస్ ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. పాడి పరిశ్రమపై జగన్రెడ్డి ప్రభుత్వానికి అవగాహన లేదని ఎద్దేవాచేశారు. సహకార సంఘాల డైయిరీలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.