ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తిశ్రద్ధలతో సాగిన రథోత్సవం

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 12:17 PM
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం దేవరకద్ర లో ఆదివారం ఉదయం భక్తిశ్రద్ధలతో సాగింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు మూడు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున స్వామి వారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి గ్రామ పురవీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంజీవా చారి, భాస్కర్ శర్మ, ప్రాణేష్ చారి, కల్వ నరేష్, లక్ష్మీకాంతరెడ్డి, జీవన్ రావు, భజన మండలి సభ్యులు, మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com