ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 03:10 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని తిమ్మసముద్రం ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం తెదేపా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు రానున్న ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని తెదేపా నాయకులు శివ కుమార్ నాయుడు, శివరాం నాయుడు, మాలేపాటి సురేష్ నాయుడు, చంద్రశేఖర్ రాజు, మస్తాన్ బాబు, రాజగోపాల్ తదితరులు తెలిపారు. 101 టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. విజయవంతంగా పాదయాత్ర జరగాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com