అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ తుది ఘట్టానికి చేరుకుంది. భారత్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, మరో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుకుంది. దీంతో రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో ధృడంగా ఉంది. ఫైనల్లోనూ ఇంగ్లండ్ ను ఓడించి కప్ తీసుకురావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.