ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక సర్వీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 12:33 PM

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 27, 28వ తేదీల్లో స్పెషల్ ట్రైన్స్‌ను తిప్పనుంది. అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ ట్రైన్లు ఆగనున్నాయి. ఈ మేరకు ట్రైన్ల వివరాలను పేర్కొంటూ ట్విట్టర్‌లో దక్షిణ మధ్య రైల్వే పోస్ట్ చేసింది.


సికింద్రాబాద్-తిరుపతి(ట్రైన్ నెంబర్ 07489) ఈ నెల 27న అందుబాటులో ఉండనుంది. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.50 నిమిషాలకు తిరుపతి చేరుకోనుంది. ఇక తిరుపతి-సికింద్రాబాద్(ట్రైన్ నెంబర్ 07490) ఈ నెల 28న తిరగనుంది. ఆ రోజు సాయంత్రం 8.25 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.30 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రెండు ప్రత్యేక రైళ్లను తిప్పనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.


నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ ట్రైన్స్ ఆగనున్నాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, AC II టైర్, AC III టైర్, స్లీపర్, సెకండ్ క్లాస్ జనరల్ కోచ్‌లు ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుపతి వెళుతూ ఉంటారు. దీంతో భక్తుల రద్దీకి తగ్గట్లు ట్రైన్లు అందుబాటులో లేవు. ఈ కారణంతో సికింద్రాబాద్-తిరుపతి మధ్య దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులతో ఈ మార్గంలోనవెళ్లే ట్రైన్లన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి.


ప్రయాణికుల రద్దీ ఈ మార్గంలో ఎక్కువగా ఉండటంతో.. త్వరలో వందే భారత్ ట్రైన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందే భారత్ రైళ్లు ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. ఈ మూడు వందే భారత్ రైళ్లలో ఒక ట్రైన్‌ను సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిప్పనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మార్గం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే.. శ్రీవారి భక్తులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రయాణ సమయం మరింత తగ్గి తిరుపతికి తక్కువ టైమ్‌లో చేరుకుని దర్శనం చేసుకోవచ్చు. దీంతో త్వరలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే రైల్వే శాఖ ప్రతిపాదనలు కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com