ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు, కొత్తగా పరిశ్రమలు రాలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 02:26 PM

వైసీపీ పాలనలో బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన మాజీ మంత్రి పరసారత్నంతో కలసి నెల్లూరు జిల్లా, కలువాయి మండలం నూకనపల్లి, తెలుగురాయపురం, తోపుగుంట గ్రామాల్లో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు, కొత్తగా పరిశ్రమలు రాలేదు... దీంతో బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయడు ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. మళ్లీ చంద్రబాబు నాయడు సీఎం అయితే తప్ప భవిష్యత్తు బాగుపడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జీ.వెంకటేశ్వర్లు నాయడు, కొండ్లపూడి రాఘవరెడ్డి, కేశవచౌదరి, కిషోర్‌రెడ్డి, బత్తలపల్లి నారాయణరెడ్డి, రాం నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, జీ.రమణయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com