ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనల్ని ఎవడ్రా ఆపేది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 13, 2023, 12:13 PM

 ‘మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డీ.. నీ తండ్రినే ఎదిరించా.. నువ్వెంత’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. గురువారం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం వద్ద ‘యువశక్తి’ పేరిట ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంపైన, మంత్రులపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెధవలతో, గూండాలతో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసన్నారు. మరోసారి ప్యాకేజీ, దత్తపుత్రుడని అంటే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. విశాఖ ప్రత్యేక రాష్ట్రం కావాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ పవన్‌ ప్రసంగం ప్రారంభించారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచి జగన్‌ గురించి తెలుసన్నారు. ‘జైలుకు వెళ్లివచ్చిన ఖైదీ. 6093 నంబర్‌ కొడితే వివరాలు వస్తాయి. ఆయన కూడా నా గురించి మాట్లాడితే ఎలా? డీజీపీ గారూ.. మీరు సెల్యూట్‌ చేస్తున్నది సీఎంకు కాదు.. 6093 ఖైదీకి’ అని అన్నారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తా.. బాంబులేస్తామంటే ఇక్కడెవరూ బాంబులు వేయించుకోరని స్పష్టం చేశారు. అన్నింటికీ తెగించి వచ్చానన్నారు. సీఎం అసందర్భంగా నవ్వుతుంటాడని ఎద్దేవా చేశారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లని అంటున్నారని.. ముగ్గురికీ విడాకులు ఇచ్చాకే పెళ్లి చేసుకున్నానని చెప్పారు. వైఎ్‌సనే ఎదిరించానని.. కాంగ్రెస్‌ వాళ్లను పంచెలూడదీసి కొడతానన్నానని.. అప్పుడే మహబూబ్‌నగర్‌లో భయపెట్టాలని చూసినా బెదిరిపోలేదని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com