ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారిని ద‌ర్శించుకున్న రాష్ట్రపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:41 PM

భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము సోమవారం మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.  ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి  టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో లు    సదా భార్గవి ,  వీరబ్రహ్మం సివిఎస్వో నరసింహ కిషోర్ పుష్పగుచ్ఛాలు అందించిస్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి  ఆలయంలోని  ధ్వజస్తంభానికి  మొక్కుకుని  పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ,ఈవో ఎవి ధర్మారెడ్డి రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ద‌ర్శనం బాగా జరిగిందని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అయిన రాష్ట్రపతి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి లతో మాట్లాడుతూ తిరుమల, తిరుచానూరులో దర్శనం ఏర్పాట్లు బాగా ఉన్నాయని సంతోషంగా చెప్పారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి ,  కొట్టు సత్యనారాయణ ,  మంత్రి ఆర్ కె రోజా  త‌దిత‌రులు పాల్గొన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com