ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బురదలో కూరుకుని తండ్రీ కొడుకులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:32 PM

నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి తండ్రీ, కొడుకులు మృతి చెందారు. చెరువులోకి దిగిన గేదెలుని తోలేందుకు వెళ్లి అలిమేలి చెంగయ్య అనే వ్యక్తి బురదలో కూరుకుని మృతి చెందాడు. తండ్రి మృతదేహాన్ని వెతికేందుకు చెరువులోకి దిగిన కుమారుడు నాగార్జున కూడా మృత్యువాత పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కుమారుడు మృతదేహం వెలికితీశారు. తండ్రి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకేసారి తండ్రీ కొడుకులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com